Featured

తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management



Published
భూగర్భ జలాలు సరిపోకపోవడంతో మామిడి సాగులో ఇబ్బంది పడ్డ రైతు సాయి సంతోష గారు.. తమ తోటలో ఇంకుడు గుంతల వంటివి తవ్వి ఇప్పుడు ఆ సమస్య అధిగమించారు. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఈ రైతు 22 ఎకరాల భూమిలో మామిడి పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఆవులతో సేంద్రీయా సేద్యం చేస్తున్నారు. Artham Farms పేరుతో మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. 9542001558 నంబరులో Artham Farms ను సంప్రదించవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management

#RythuBadi #రైతుబడి #watermanagement
Category
Management
Be the first to comment